ప్రమాదపు అంచున రాయల చెరువు…ఇళ్ళు వదలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది.
ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు గురించి సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు వేగంగా స్పందించి వుంటే ఈ పరిస్థితి తలెత్తివుండేది కాదన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. మండల అధికారుల నుంచీ సమాచారం రాగానే జిల్లా అధికారులు రాయలచెరువును పరిశీలించి ప్రమాద తీవ్రతను అంచనా వేసి ఉండాల్సింది. ఈ చెరువులోకి 10వ తేది నుంచే వర్షపు నీరు రావడంతో 15వ తేదీకి నిండిపోయింది. 17వ తేదీకే చెరువు ప్రమాదకరంగా మారింది.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
రాయలచెరువుకు ఎగువన మరో ప్రమాదం పొంచివుందన్న స్థానికులు చెబుతున్నారు. రాయలచెరువు పైన గోకులాపురం చెరువు, పిళ్ళారి కోన చెరువు, సంగటిముద్దల కోన చెరువు తదితర ఐదు చెరువులున్నాయి. ప్రస్తుతం వర్షం వల్ల ఈ ఐదు చెరువులూ నిండిపోయాయి. గోకులాపురం చెరువు ఇప్పటికే ప్రమాదకరంగా వుందని సమాచారం.
అది తెగితే కిందున్న మిగిలిన నాలుగు చెరువులూ తెగి, ఆ నీళ్లంతా రాయలచెరువు మీదపడతాయని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చెరువు కింద రామచంద్రాపురం మండల పరిధిలో గ్రామాలున్నాయి. సంజీవరాయపురం, ప్రసన్న వెంకటేశ్వరపురం, బలిజపల్లి, గంగమాంబపురం, రామిరెడ్డిపురం, గంగిరెడ్డిపల్లి, కమ్మకండ్రిగ, మిట్టూరు, పద్మవల్లిపురం, నడవలూరు, నెన్నూరు, కేకేవీపురం, వెంకట్రామాపురం, గణేశ్వరపురం, సొరకాయలపాలెం, కమ్మపల్లి పంచాయతీలకు చెందిన 112 గ్రామాలున్నాయి. వీటితో పాటు తిరుపతి రూరల్ మండలం పరిధిలో కుంట్రపాకం, తనపల్లి, పాడిపేట, ముళ్ళఊడి, తిరుచానూరు గ్రామాలున్నాయి.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?