Amaravati Farmers Padayatra: పాదయాత్రను మేం ఆపలేదు.. ఐడీ కార్డులతో వస్తే ఇప్పుడే అనుమతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామచంద్రాపురంలో జరిగిన ఘటనతో తాతాల్కికంగా తమ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు.. పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామన్నారు.. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు ఆపలేదని స్పష్టం చేశారు.. దీనిపై అమరావతి రైతులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. పోలీసులే రైతుల ఐడీ కార్డులు చించివేశారని అనడం చౌకబారు ఆరోపణ అని కొట్టిపారేశారు..
Read Also: Simona Halep: డోప్ టెస్టులో దొరికిన టెన్నిస్ స్టార్.. నిషేధం విధింపు
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
600 మంది మాత్రమే ఐడీ కార్డులతో వస్తే ఇప్పుడే అనుమతి ఇస్తాం అన్నారు డీఎస్పీ బాలచంద్రారెడ్డి… సంఘీభావం తెలిపే వారు మాత్రం రోడ్డుకి ఇరువైపులా నిలబడాలని స్పష్టం చేశారు.. మేం రైతులకు సపోర్ట్ చేస్తున్నామని వెల్లడించారు రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. కాగా, అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొన్ని విషయం తెలిసిందే.. రామచంద్రాపురం విజయ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.. హైకోర్టు ఆదేశాలకు లోబడి పాదయాత్ర చేయాలని పోలీసులు ఆంక్షలు విధించారు.. ఐడీ కార్డులు ఉన్న 600 మందికి, నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు పోలీసులు.. అమరావతి రైతులు మినహా బయటవారు పాదయాత్రలో పాల్గొనకూడదని తేల్చేశారు.. అయితే, నిన్నటిలాగే ఇవాళ కూడా పాదయాత్ర అడ్డుకుంటున్నారని పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు.. ఆ తర్వాత పాదయాత్ర నాలుగు రోజుల పాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!