Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Money Circulation Scheme In Prakasam District

AP Crime: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! నిండా ముంచిన మనీ సర్కులేషన్‌ స్కీం యాప్‌..

Published Date :June 26, 2024 , 7:37 pm
By Sudhakar Ravula
  • సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశ..
  • మనీ సర్కులేషన్ స్కీం యాప్‌ల బారినపడుతున్న ప్రజలు..
  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందచ్చన్న ఆశతో పెట్టుబడి పెట్టి నిండా మునిగారు..
AP Crime: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! నిండా ముంచిన మనీ సర్కులేషన్‌ స్కీం యాప్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Crime: సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొందరు ప్రజలు మనీ సర్కులేషన్ స్కీం యాప్‌ల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందచ్చన్న ఆశతో ఏది నిజమో ఏది అబద్దమో గ్రహించలేక పోతున్నారు. అయితే, కోట్ల రూపాయలలో ప్రజల నుంచి డబ్బులు కట్టించుకొని బోర్డులు తిప్పేస్తున్నాయి మనీ సర్కులేషన్ స్కీం యాప్ లు.. ఎవరికి చెప్పుకోవాలో.. ఏమి చేయాలో తెలియక ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్న ఘటన ప్రకాశం జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.

Read Also: Italy: భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన.. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన

Also Read

  • Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
  • Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
  • Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్‌ఏ టెస్ట్..
  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు, మార్కాపురం మండలాల మరియు పరిసర ప్రాంతాలలో మై క్వీన్ అనే సంస్థ ప్రజలకు శతగోపం పెట్టింది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చంటూ అమాయక ప్రజలకు మై క్విన్ అనే మనీ సర్కులేషన్ స్కీం సంస్థ వలవేసింది. అత్యధికంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులే మైక్ క్విన్ మనీ సర్కులేషన్ యాప్ సంస్థకు టార్గెట్ గా మారారు. వంద రూపాయలు పెడితే 24 గంటల్లో 700 రూపాయలు ఇస్తామని మై క్వీన్ ప్రజలకు ఆశ చూపించి ముంచేసింది.. 24 గంటల్లో పెట్టిన పెట్టుబడికి ఏడు రెట్లు లాభాలు పొందవచ్చన్న ఆశతో ప్రజలు ఎగబడి డబ్బులను మైక్వీన్ లో పెట్టుబడి పెట్టారు. అయితే మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం యజమాని ఎవరో, ఎక్కడుంటాడో కూడా ఎవరికీ తెలియదు.

Read Also: Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ

ఈ సంస్థ చెన్నై కేంద్రంగా నగదు లావాదేవీలు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే జరిపిందని ప్రాథమిక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. మొదట ఈ మై క్వీన్ యాప్ లింకు ద్వారా సంస్థలోకి అడుగు పెట్టిన వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేస్తారు. తర్వాత ఒక్క రూపాయి కడితే 24 గంటల తర్వాత ఒక రూపాయికి 7 రూపాయలు సంస్థ చెల్లిస్తుందని చెప్పడంతో మై క్వీన్ లో అడుగుపెట్టిన వాళ్లు మరొకరికి సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిగా మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో వేళల్లో భాగస్వాములుగా మారిపోయారు.. చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చేసి మరి కోట్లల్లో మైక్విన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టారు. గత కొద్దిరోజులుగా ఈ మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం సంస్థ నగదు లాభాదేవీలను నిలిపివేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు.. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని నిశ్శబ్దంగానే ఉండిపోయారు. ఏ ఒక్క బాధితుడు కూడా ఒక్క ఫిర్యాదు అంటే ఒక్క ఫిర్యాదు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అత్యాశకు పోయి ఇటువంటి సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap crime
  • Money Circulation Scheme
  • police
  • Prakasam District

తాజావార్తలు

  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..

  • Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..

  • TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ

  • Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions