Polavaram Project Virtual Meet: పోలవరంపై ముగిసిన నాలుగు రాష్ట్రాల వర్చువల్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరంపై నాలుగు రాష్ట్రాల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయించామని కేంద్రం పేర్కొంది. నివేదిక ఆధారంగానే చర్యలని స్పష్టీకరించింది. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేపట్టేందుకు సహకరించాలని పీపీఏ ఛైర్మన్ పేర్కొన్నారు. పీపీఏ ఛైర్మన్ ప్రతిపాదనలకు ఏపీ, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల అంగీకారం తెలిపింది. అయితే, సంయుక్త సర్వేకు నో ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. మళ్లీ వచ్చే నెల ఏడో తేదీన సాంకేతిక నిపుణులతో మరో భేటీ నిర్వహించనుంది జలశక్తి మంత్రిత్వ శాఖ.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్ పై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని వర్చువల్ సమావేశంలో కేంద్రజల శక్తి శాఖ తెలిపింది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని స్పష్టం చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా ఉండదని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనా ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది.
మరోమారు బ్యాక్ వాటర్ సర్వే చేయించాలని కోరింది తెలంగాణ. అయితే ఈ వాదనను తోసిపుచ్చింది కేంద్రం. గోదావరి ట్రిబ్యునల్ సిఫార్సుల మేరకు 36 లక్షల వరద జలాలు వెళ్లేలా స్పిల్ వే కట్టాలని ఉన్నా ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు పూర్తి అవుతున్నట్టు పేర్కొంది కేంద్రం. బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించింది. అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది జలశక్తి శాఖ.
Read Also: Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!