Polavaram Flood Victims: విలీన మండలాల్లో హోరెత్తిన పోలవరం నిర్వాసితుల ఆందోళన.. వరద నీటిలో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.
Read Also: TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఇక, ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో, కాంటూరు కాకిలెక్కలతో తమని ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.. ప్రతీ సారి వరదలు రావడం, అధికారులు నాలుగు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 10 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటైపోయిందని బాధితులు వాపోయారు.. ఈ సారి వచ్చినభారీ వరదలతో తాము సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంకా అధికారులు చెప్పే మాయమాటలు నమ్మే ఓపిక తమకు లేదని, వెంటనే మునిగే గ్రామాలన్నింటిని 41.15 కాంటూరు లో కలిపి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి ఈ బాధలనుండి తమకు విముక్తి కలగ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు… సుమారు 300 మందికి పైగా నిర్వాసితులు పాల్గొన్న ఈ ధర్నాలో తమకు సత్వరమే ప్రభుత్వం న్యాయం చెయ్యకపోతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. ఇక, అల్లూరి జిల్లా చింతూరులో పోలవరం ముంపు బాధితుల ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!