Pilli Subhash Chandra Bose: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilli Subhash Chandra Bose Fires On Central Govt On BC Issue: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ జన గణన కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తే, హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన పరిమితి మేరకు బీసీలకు సీఎం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో కూడా జగన్ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. బీసీ కుల గణన కోసం జరిపే పోరాటానికి మల్లాడి నాయకత్వం వహించాలని కోరారు. సత్తా ఉన్న ధీరుడు, వీరుడు మల్లాడి.. కుర్చీలు కదిలిపోయేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానికి కుతూహలం ఉన్నా.. వెనుకున్న వారు చేయనివ్వరని ఆరోపించారు. కుల గణన కోసం ఉద్యమం చేయాలని చెప్పారు. బీసీ గణనపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ విషయం చెప్పడానికి తాను సిగ్గు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
World Cup: ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
ఇదే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీజేపీ విధానాల వల్ల రక్తపాతం వస్తోందన్నారు. బీసీ అంటే బాహుబలి కమ్యూనిటీ అని అభివర్ణించారు. బీసీలు రెండు తలకాయల పాములా ఉండిపోయామని ఆవేదన చెందారు. బీసీ జనగణన 1931 తర్వాత జరగలేదన్నారు. బీసీ జనగణన ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కుల గణన జరగాలని చెప్తున్నాయన్నారు. మండలి కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు.
Alla Nani: పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్ను ఏమి చేయలేరు
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!