Andhra Pradesh: గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగినట్లు అవుతుంది. తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరులను ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
Read Also: Pawan Kalyan: విద్యుత్ షాక్తో రైతుల మృతి బాధాకరం.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి
Also Read
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తోంది. ఈ మేరకు 1254 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. 106 ప్రొఫెసర్ పోస్టులను, 312 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. అవసరమనుకుంటే ప్రైవేట్ రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వ రంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వాక్ఇన్ ఇంటర్వ్యూలాంటి పద్ధతులను వైద్య ఆరోగ్యశాఖ అవలంభిస్తోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం చేపట్టిన చర్యల కారనంగా స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల కారణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో 3 వేల పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అవసరాలకు తగినట్లుగా, ప్రతి ప్రాంతంలో కూడా అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!