Andhra Pradesh: గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్లు
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగినట్లు అవుతుంది. తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరులను ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
Read Also: Pawan Kalyan: విద్యుత్ షాక్తో రైతుల మృతి బాధాకరం.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తోంది. ఈ మేరకు 1254 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. 106 ప్రొఫెసర్ పోస్టులను, 312 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. అవసరమనుకుంటే ప్రైవేట్ రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వ రంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వాక్ఇన్ ఇంటర్వ్యూలాంటి పద్ధతులను వైద్య ఆరోగ్యశాఖ అవలంభిస్తోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం చేపట్టిన చర్యల కారనంగా స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల కారణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో 3 వేల పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అవసరాలకు తగినట్లుగా, ప్రతి ప్రాంతంలో కూడా అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!