Petrol,Diesel Mafia: కృష్ణాజిల్లాలో రెచ్చిపోతున్న పెట్రోల్, డీజిల్ మాఫియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే ఆకాశాన్నంటుతున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు. దీనికి తోడు మాఫియా రెచ్చిపోతోంది. కృష్ణాజిల్లాలో రెచ్చిపోతుంది పెట్రోల్,డీజిల్ మాఫియా. ట్యాంకర్లలోనే ఫేక్ కొలతలతో పెట్రోల్ చోరీ జరిగిపోతోంది. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు మాఫియా నిర్వాహకులు. జిల్లాలోని కృత్తివెన్ను పెట్రోల్ బంక్ లో పట్టుపడ్డ పెట్రోల్ మాఫియా బాగోతం అందరినీ విస్మయానికి గురిచేసింది. డీలర్లను మోసం చేసి పెట్రోల్ అమ్ముకుంటున్నారు మాఫియా కేటుగాళ్లు. డీలర్స్ కు దొరకకుండా ట్యాంకర్లలో ఏర్పాట్లు చేసుకోవడం కొసమెరుపు.
ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ డీలర్స్. పట్టు పడ్డ లెక్క చెయ్యడం లేదు మాఫియా. పైగా తమను ఎదిరిస్తే దాడులు తప్పవని హెచ్చరికలు జారీచేస్తున్నారు. తాడిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు మరొకరు ఉంటాడు అనేది సామెత. అది అప్పుడు ఎంత నిజం అయ్యేది తెలీదు గానీ ఇప్పుడు మాత్రం అక్షరాలా నిజం అవుతోంది. ఇప్పటివరకు కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులే వినియోగదారులను బురిడీ కొట్టించడం చూసుంటాం. కానీ వారిని సైతం దోసెస్తున్నారు కొంతమంది ఘరానా మోసగాళ్లు.
Also Read
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
ఏకంగా డీలర్ల వద్దే పెట్రోల్, డీజిల్ ను మాయం చేసేస్తున్నారు ఈ మాఫియా. .కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు విజయవాడ కొండపల్లి వద్ద నుండి ఇండియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తారు. ఒక ట్యాంకర్ లో మూడు కంపార్ట్మెంట్ల అమరిక ఉంటుంది. అందులో ఒక్కొక్క కంపార్ట్మెంట్ కు 4000 లీటర్ల చొప్పున మొత్తం 12,000 లీటర్లు పెట్రోల్ పడుతుంది. దీనిని పెట్రోల్ బంకుకి సరఫరా చేస్తారు.
Read Also: Kerala High Court: ప్రసవ వేదన భరించేది స్త్రీనే.. గర్భం దాల్చడం ఆమె ఇష్టం…
అలా సరఫరా చేసే ట్యాంకర్లలోనే పెట్రోల్ ,డీజిల్ ను దొంగిలించేస్తున్నారు ఘరానా దొంగలు. అలా దొంగిలించినా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. అనుమానం వచ్చిన కృష్ణా జిల్లాలోని కొందరు పెట్రోల్, డీజిల్ డీలర్లు కృష్ణా జిల్లా కృతివెన్నులో చెక్ చెయ్యగా అసలు విషయం బయటపడింది. ట్యాంకర్ల మోసాన్ని గమనించిన డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేసారు. మొత్తానికి వినియోగదారుల్ని మోసం చేసే డీలర్లనే మోసం చేసే మాయామశ్చీంద్రలు వచ్చేశారన్నమాట.
Read Also: Batukamma: రేఖా శ్రీ ‘సన్న జాజుల బతుకమ్మ’
తాజావార్తలు
-
Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!