Weather alert : పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather alert: ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీనితో భానుడు భగభగ మంటున్నాడు. ఈ నేపథ్యంలో వేడి తీవ్రత అధికంగా ఉంది. ఓపక్క పెరిగిన వేడి తీవ్రత.. మరోపక్క ఉక్కపోత దీనితో మిడ్ సమ్మర్ ను తలపిస్తోంది అంటున్నారు ప్రజలు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించక పోతే ఇళ్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. కాలం కాని కాలంలో ఎండ తీవ్రత తార స్థాయికి చేరుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ఉష్టోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావాలనంటేనే భయపడుతున్నారు. అక్టోబర్,నవంబర్ ఈ రెండు నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో ఉన్నాయి. దీని కారణంగా మేఘాలు ఏర్పడడం లేదు. దీనికి తోడు తీర ప్రాంతం కావడం చేత గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఉక్కపోతగా ఉంటుంది. అక్టోబరు 15 నాటికి రుతుపవనాల నిష్క్రమణ పూర్తవుతుంది.
Read also:Viral news: బుడ్డోడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. తల్లిని గుద్దిన కారుకు ఎదురెళ్లి తిరగబడ్డాడు
Also Read
దీనిని బట్టి చూస్తే నవంబరు మొదటి వారం వరకు వేడి, ఉక్కపోతను భరించక తప్పదు. ఒక్కసారిగా వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే వానలకు అవకాశముంది. లేకపోతే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలంలో వర్షాలు దాదాపుగా ముగిసినట్లే అని భిప్రాయపడుతున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!