Peddireddy Ramachandra Reddy: అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy Warning To Land Occupiers: అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవని పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సర్వే ద్వారా కబ్జాదారులను గుర్తిస్తామని.. ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీ శాఖకు బదలాయిస్తామని అన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అటవీభూముల సంరక్షణపై ప్రత్యేక్ష దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 10 వేల ఎకరాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే కొనసాగుతోందని.. కబ్జాకు గురైన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే.. చిత్తూరు జిల్లాలోని ఏనుగుల సమస్యపై మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వెంటనే అదనపు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 11 బెస్ క్యాంపులు ఉన్నాయి. వాటికి అదనంగా మరో మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇటీవల ఏనుగుల బెడద పెరిగింది. బేస్ క్యాంప్ ఏర్పాటుతో ట్రాక్టర్లు పెరగనున్నాయి. బేస్ క్యాంపులు అందుబాటులోకి వస్తే.. ఏనుగుల సంచారంపై గ్రామస్తులకు తక్షణమే సమాచారం అందించడానికి వీలుంటుంది. అలాగే.. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు సత్వర చర్యలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటవీ శాఖ జిల్లాలో 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తోంది. జిల్లాలో మొత్తం 80 నుండి 90 ఏనుగులు సంచరియస్తున్నాయని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..