Peddireddy Ramachandra Reddy: ఊద కర్రతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy Reacts On Chandrababu Amit Shah Meeting: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు గంటసేపు చర్చలు జరిపారని.. ఊద కర్రతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీ విజయోత్సవ మహాసభను నిర్వహించారు. సీఎం జగన్ నాలుగు సంవత్సరాల సుపరిపాలన, గడప గడపకు మన ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా ఈ మహాసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రెండు పేజీల మేనిఫెస్టోతో వచ్చిన వైఎస్ జగన్, ఆ హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. 2014లో టిడిపి మేనిఫెస్టో ఏం చేశారో అందరికీ తెలుసని అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి కూడా తొలగించిన ఘనత టీడీపీది అని విమర్శించారు. తమ వైసీపీ నాయకులు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఎన్నోసార్లు చెప్పారని.. 2019లో ఎలా విజయం సాధించామో, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా నడిచే పరిస్థితిలో చంద్రబాబు లేకపోవడం వల్లే.. నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ఆయన వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. వైసీపీని ఏం చేయలేరని, మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.
Operation Malamaal: ఢిల్లీ జంట హత్యల కేసులో పురోగతి.. మిలియనీర్ కావాలనే హత్యలు
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
అంతకుముందు.. పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి, టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 100 పేజీలో మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని ఆరోపించారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు విమర్శించారని.. వైసీపీ కేవలం రెండు పేజీల మేనిఫెస్టోతో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. ఇకపై టీడీపీ కార్యకర్తలు మేనిఫెస్టోతో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడతారని.. రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్ గతంలో కంటే అధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చారు.
Sunny Leone : బికినీతో బీచ్ ఒడ్డున సన్నీలియోనీ.. మమ్మల్నీ పిలవొచ్చుగా అన్న నెటిజన్
తాజావార్తలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..