Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం.. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. తాను ఓడిపోవడానికి కారణాలను కూడా చెప్పారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చెయొద్దని వారించారు. ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలో ఉన్నామని అన్నారు. రెండు చోట్ల పరాజయం పాలైనప్పటికీ.. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు తన వెంట ఉన్నారని చెప్పారు. అన్ని విధాలా ధైర్యం చేసే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మాటలు పడ్డామని.. మన్ననలు పొందామని చెప్పారు.
Also Read:Pawan Kalyan: రెండుచోట్ల ఓడిపోయినా.. నన్ను నడిపించింది మీరే
రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కులాలను కలిపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. జనసేన ఉన్నదే సమాజంలో పరివర్తన తీసుకురావడానికని స్పష్టం చేశారు. ఒక కులాన్ని గద్దెని ఎక్కించడం కోసం తాను పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలన్న జనసేనాని.. అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
Also Read:IIT Student Suicide: ఐఐటీ మద్రాస్ విద్యార్థి ఆత్మహత్య.. నెల వ్యవధిలో రెండో ఘటన..
Also Read
తన దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని పవన్ హెచ్చరించారు. ఒక కులం, ఒక మతం ఆధారంగా సమాజాన్ని నడపలేమని జనసేనాని అన్నారు. తన సినిమాలన్నీ ఒక్క కులం వారు చూస్తే తాను రోజుకు రూ. 2 కోట్ల పారితోషకం తీసుకోగలనా అని ప్రశ్నించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని.. ఇప్పటికైనా కులం పేరుతో కొట్టుకు చావడం ఆగాలని పవన్ చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?