Pawan Kalyan: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లలో 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు.. ఒక్క సీఎం జగన్ కు తప్ప. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారంలోకి రావటానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ఫాదర్స్ డే రోజున రైతుల పిల్లలకు న్యాయం జరగాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు.. కన్నీరు తుడిచే గుండె చాలు. సీఎంతో సహా వైసీపీ నేతలు ఏపీలో ఏమైనా మాట్లాడొచ్చు. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారన్నారు. నేను ఏమైనా మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పాలసీ ప్రకారం మాట్లాడితే మేము రెడీ.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
డబ్బు మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఏదైనా మాట్లాడితే దత్త పుత్రుడు అంటూ మాట్లాడుతున్నారు. న్యాయం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలి.. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎమ్మెల్యేలకు కూడా డబ్బు మదం ఎక్కింది. అవకాశాలు లేక ప్రకాశం జిల్లా నుండి వలసలు పెరిగాయి. వెలిగొండ ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తికాక పోయినా అడిగే నాయకులు ఉండరన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ పరామర్శ
ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేదు. పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి.. ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారు. నేను ఎవరికీ దత్త పుత్రుడిని కాదు.. ప్రజలకు మాత్రమే దత్త పుత్రుడిని. మీరు సీబీఐ దత్త పుత్రుడు అంటే సహించలేరు. వివేకానందరెడ్డి మృతిపై ఇంత వరకు స్పష్టత లేదు. ఉద్యోగానికి వెళ్ళాలన్నా కేసులు ఉంటే రావు.. మరి ఎమ్మెల్యేలకు ఇవి వర్తించవా?
కొన్ని భావజాలాలను నమ్ముకున్నా కాబట్టే సొంత పార్టీ పెట్టా. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలను రీకాల్ చేసే అధికారం ఉంటే వీరు తప్పులు చేస్తారా. దశాబ్దాలు కష్టపడాలనే రాజకీయాల్లోకి వచ్చా. ముఖ్యమంత్రి కావాలని రాలేదన్నారు పవన్. తప్పు చేస్తే ముఖ్యమంత్రిని అయినా చొక్కా పట్టుకుని నిలదీసే కార్యకర్తలను తయారు చేసేందుకు వచ్చానన్నారు.
రైతులు వ్యవసాయం గిట్టుబాటు లేక క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారు. రైతులు ఇబ్బందుల వల్ల క్రాప్ హాలీడే ప్రకటిస్తుంటే మేము రెచ్చగొడుతున్నామంటున్నారు. వాళ్ళు చేసిన ఐదు లక్షల కోట్లలో లక్ష కోట్లు మినహా మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించాలి? ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో చెప్పేవారు లేరు. ఏమైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళు బూతులు తిడుతున్నారు.. ఇది సమంజసమా?ప్రశ్నిస్తే కేసులు పెట్టించే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
ప్యాంటు విప్పి అరాచకం.. ఘాటు అందాలను ఎరగా వేసి మరీ చూపిస్తుందే
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!