విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నించాలని.. కేంద్రాన్ని అడగకుంటే తప్పు చేసినట్టు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో… వైసీపీ… అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నామని…పేర్కొన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పడం లేదని ఫైర్ అయ్యారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో వైసీపీ ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీకి తన బాధ్యతను గుర్తు చేసేలా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు పవన్. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కలిసిన రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.