Pawan Kalyan: నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan comments at vaarahi yatra 2 sabha: ఏలూరులో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారాహి 2వ దశ విజయ యాత్ర కు ఏలూరులో ఇంత ఘన స్వాగతం లభిస్తుంది అనుకోలేదు, దారిపొడవునా అక్కాచెల్లెళ్ళు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారని అన్నారు. హల్లో ఏపీ – బైబై వైసీపీ అనే నినాదం చాలా నలిగిపోయి, ప్రజలు బాధలు పడ్డాక బయటకు వచ్చింది, ఇది నా నుండి వచ్చిన నినాదం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి వచ్చిన నినాదం అని అన్నారు. నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి? మీరు అభిమానించే హీరోను , సరదాగా రాజకీయాల్లోకి రాలేదు… స్కూల్లో మహనీయుల గురించి చెప్పి, విలువలు నేర్పించి, బయట నేరగాళ్లు, విలువలు లేని వాళ్ళు పాలిస్తుంటే నచ్చలేదు, మీ భవిష్యత్తు కోసం పనిచేయాలి, అని గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా పర్లేదు అని పోరాటానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.
Ee Nagaraniki Emaindi: రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
నేను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే, వైసీపీ నాయకులు నా తల్లి గురించి, నా ఇంట్లో ఆడవారి గురించి, పిల్లల గురించి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారని ఆయన అన్నారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ గారి స్ఫూర్తి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్న ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంచోడా, చెడ్డోడా అని చూడకుండా ఆ స్థానానికి నేను గౌరవించని, జగన్ రెడ్డి గారు అని గౌరవించాను… ఈరోజు నుండి అంబేద్కర్ గారి సాక్షిగా జగన్ రెడ్డి ని ఏకవచనంతో పిలుస్తాను, ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని పవన్ అన్నారు. వైఎస్ జగన్, వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని, 2024 లో వైఎస్ జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని,. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుండి, యువతీ, యువకుల ఉద్యోగ సమస్యలు, ఆడపడుచుల రక్షణ, రోడ్ల సమస్య, గంజాయి సమస్యలు ఉన్నాయి, ఈరోజు వీటి గురించి మాట్లాడుతానని అన్నారు. మనం వైఎస్ జగన్, వైసీపీకి బానిసలు కాదు, ఆయన మనలో ఒకడు అంతే. మన అందరం టాక్సులు కడితే, ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి, ఆయన కేవలం జవాబుదారీ మాత్రమే అని అన్నారు.
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?