Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: (188, 143, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎస్సై రవి వర్మ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు..
Read Also: TDP MLA Bandaru Sravani: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల కలకలం..
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయ్యింది.. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు కేసు పెట్టారు పోలీసులు.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు జనాభా సమీకరణ నేపథ్యంలో .. సెక్షన్ 223, 189 క్లాజ్ 2, 292, 125క్లాజ్ 2, 126క్లాజ్ 2, 132, 190, బీఎన్ ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు.. కాగా, జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత.. జోగి రమేష్, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ జగన్.. శుక్రవారం జోగి నివాసానికి వెళ్లిన విషయం విదితమే కాగా.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పబ్లిక్ తరలివచ్చారు.. ఈ నేపథ్యంలోనే కేసులు పెట్టారు పోలీసులు..
