No Registrations in Kuppam:అంతా రాజకీయకుట్ర అంటున్న వ్యాపారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు నెలల నుంచి లేఅవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందని నేతలు చెబుతున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆపేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటి పరిధిలోని కోట్లలో పెట్టుబడి పెట్టివ వ్యాపారులు.. లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.మరోవైపు రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సగానికి తగ్గిపోయిందని అధికారులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. జనవరి నెలాఖరు వరకు 4.80కోట్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
మరోవైపు గత నాలుగు నెలల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెంచర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనధికారికంగా నిలిపివేయడం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కొనుగోలు విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది కాని జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగిందని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీని వల్ల భూమి అమ్ముకొని తమ పిల్లలకు పెళ్లిళ్లు ,చదువులు చేయడానికి ఎదురు చూస్తున్న చాలామంది కుప్పం వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే నియోజకవర్గంలో టీడీపీని దెబ్బ తీయాలంటే నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలకు వెంచర్ లతో సంబంధాలు ఉన్నాయని వాటి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఆర్థికంగా దెబ్బతింటారని అధికార పార్టీ సూచనలతోనే ఇలా చేస్తున్నారనే స్దానిక నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలోని సైట్ రిజిస్ట్రేషన్ నిలిపివేయడం చాలా దారుణమని వాపోతున్నారు కుప్పం ప్రజలు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!