Nimmala Ramanaidu : కృష్ణా జలాల్లో 512 TMC సాధించిన ఘనత చంద్రబాబుది
- అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సాగునీటి ఎన్నికలు నిర్వహించాం
- జగన్ హయాంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి
- మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకున్నారు
- శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టు రూ.150 కోట్లు : మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధాన కాలువలు, డ్రైన్ల మరమ్మతులకు మొట్టమొదటి ఏడాదిలోనే రూ.344 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు గత ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, తాము ఏడాదిలోనే రూ.1,900 కోట్ల పరిహారం అందజేశామని నిమ్మల తెలిపారు.
Also Read
హంద్రీ-నీవా పనులను కూడా వేగవంతం చేసి ఇప్పటివరకు రూ.3,870 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.2,352 కోట్లు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో వంశధార, తోటపల్లి, హిరమండలం వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి రాబోయే రెండేళ్లలో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా జలాల్లో 512 TMC నీటిని సాధించడం పూర్తిగా చంద్రబాబు నాయకత్వపు ఘనతేనని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కృష్ణా జలాల అంశంలో గత ప్రభుత్వం ఎప్పుడూ మౌనం వహించినట్టు ఆయన విమర్శించారు. 2020లో డయాఫ్రం వాల్ కూలినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!