న్యూస్ రౌండప్: తూర్పుగోదావరి జిల్లా వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఐపై అవినీతి ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు.
Also Read
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సర్వీసులను, జిల్లా పరిధిలో రూట్లలోనూ బస్సులు తిరగనున్నాయి. కాగా కాకినాడ, రాజమండ్రి నుంచి ఎటపాక, సీలేరుకు సర్వీసులు పెంచారు. దూరప్రాంత సర్వీసులకు ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చిరుత సంచారం
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం-ఫోర్బై గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచారంతో మన్యం వాసుల్లో భయాందోళన నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వాహనదారులకు చిరుతపులి కనిపించింది. రహదారిపై చిరుతను చూసి ఫోర్ బై గ్రామస్థులను యువకులు అప్రమత్తం చేశారు. లక్కవరం రేంజ్ డీఆర్వో జాన్సన్ సిబ్బందితో కలిసి వచ్చి పలిశీలిస్తున్నారు. చౌడు నేల వద్ద చిరుత ఆకారంలో ఉండే దుమ్ములగొండి పాదముద్రలను డీఆర్వో జాన్సన్ సిబ్బంది గుర్తించారు.
లక్ష డోసులు లక్ష్యం
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా లక్ష మందికి మొదటి డోసు టీకాలు ఇవ్వనున్నారు. ఒక్కరోజే లక్ష మందికి టీకాలు వేయడం ద్వారా రికార్డు సాధించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లలోపు పిల్లల తల్లులకు, 45 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాకు చేరిన 1.50 లక్షల డోసుల కొవిషీల్డ్, 8 వేల డోసులు కొవాగ్జిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 84 రోజులు దాటిన తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!