న్యూస్ రౌండప్: తూర్పుగోదావరి జిల్లా వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఐపై అవినీతి ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సర్వీసులను, జిల్లా పరిధిలో రూట్లలోనూ బస్సులు తిరగనున్నాయి. కాగా కాకినాడ, రాజమండ్రి నుంచి ఎటపాక, సీలేరుకు సర్వీసులు పెంచారు. దూరప్రాంత సర్వీసులకు ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చిరుత సంచారం
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం-ఫోర్బై గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచారంతో మన్యం వాసుల్లో భయాందోళన నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వాహనదారులకు చిరుతపులి కనిపించింది. రహదారిపై చిరుతను చూసి ఫోర్ బై గ్రామస్థులను యువకులు అప్రమత్తం చేశారు. లక్కవరం రేంజ్ డీఆర్వో జాన్సన్ సిబ్బందితో కలిసి వచ్చి పలిశీలిస్తున్నారు. చౌడు నేల వద్ద చిరుత ఆకారంలో ఉండే దుమ్ములగొండి పాదముద్రలను డీఆర్వో జాన్సన్ సిబ్బంది గుర్తించారు.
లక్ష డోసులు లక్ష్యం
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా లక్ష మందికి మొదటి డోసు టీకాలు ఇవ్వనున్నారు. ఒక్కరోజే లక్ష మందికి టీకాలు వేయడం ద్వారా రికార్డు సాధించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లలోపు పిల్లల తల్లులకు, 45 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాకు చేరిన 1.50 లక్షల డోసుల కొవిషీల్డ్, 8 వేల డోసులు కొవాగ్జిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 84 రోజులు దాటిన తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!