న్యూస్ రౌండప్: తూర్పుగోదావరి జిల్లా వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఐపై అవినీతి ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు.
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సర్వీసులను, జిల్లా పరిధిలో రూట్లలోనూ బస్సులు తిరగనున్నాయి. కాగా కాకినాడ, రాజమండ్రి నుంచి ఎటపాక, సీలేరుకు సర్వీసులు పెంచారు. దూరప్రాంత సర్వీసులకు ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చిరుత సంచారం
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం-ఫోర్బై గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచారంతో మన్యం వాసుల్లో భయాందోళన నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వాహనదారులకు చిరుతపులి కనిపించింది. రహదారిపై చిరుతను చూసి ఫోర్ బై గ్రామస్థులను యువకులు అప్రమత్తం చేశారు. లక్కవరం రేంజ్ డీఆర్వో జాన్సన్ సిబ్బందితో కలిసి వచ్చి పలిశీలిస్తున్నారు. చౌడు నేల వద్ద చిరుత ఆకారంలో ఉండే దుమ్ములగొండి పాదముద్రలను డీఆర్వో జాన్సన్ సిబ్బంది గుర్తించారు.
లక్ష డోసులు లక్ష్యం
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా లక్ష మందికి మొదటి డోసు టీకాలు ఇవ్వనున్నారు. ఒక్కరోజే లక్ష మందికి టీకాలు వేయడం ద్వారా రికార్డు సాధించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లలోపు పిల్లల తల్లులకు, 45 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాకు చేరిన 1.50 లక్షల డోసుల కొవిషీల్డ్, 8 వేల డోసులు కొవాగ్జిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 84 రోజులు దాటిన తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?