టీడీపీ సీనియర్ నేతపై హత్యాయత్నం.. నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తిక్కారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ ఆరోపించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ అనే కత్తికి జగన్ బలిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. కత్తిని నమ్ముకుంటే కత్తికే బలికాక తప్పదని హితవు పలికారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతలకు హతమార్చడానికా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారు @ysjagan. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతల్ని హతమార్చడానికా? బాధ్యతాయుతంగా ఉండాల్సిన మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం మీలోని మానసిక రుగ్మతని బయటపెడుతుంది.(1/3) pic.twitter.com/1fdaUxPNzq
— Lokesh Nara (@naralokesh) December 11, 2021
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!