Srisailam Temple: శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి
- శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం..
- గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు..
- కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పెరిగిన రద్దీ..
Srisailam Temple: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూల్లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది.
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీపీ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
మరోవైపు, పుణ్యప్రదమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం రోజున కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. రుద్రుడు, త్రినేత్రుడు, భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ‘ఓం నమఃశివాయ’, ‘హర హర మహాదేవ’ మంత్రాలు అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి (స్వయంభూ) దేవాలయంలో వైభవం ఈరోజు ఉచ్ఛస్థితిలో నిలిచింది.వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని, జటాజూటధారి అయిన శివయ్యకు పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో, ఉసిరి కొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి, పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ పి. కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా, భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!