Srisailam Temple: శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి
- శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం..
- గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు..
- కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పెరిగిన రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూల్లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది.
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీపీ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
మరోవైపు, పుణ్యప్రదమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం రోజున కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. రుద్రుడు, త్రినేత్రుడు, భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ‘ఓం నమఃశివాయ’, ‘హర హర మహాదేవ’ మంత్రాలు అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి (స్వయంభూ) దేవాలయంలో వైభవం ఈరోజు ఉచ్ఛస్థితిలో నిలిచింది.వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని, జటాజూటధారి అయిన శివయ్యకు పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో, ఉసిరి కొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి, పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ పి. కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా, భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!