Srisailam Temple: శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి
- శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం..
- గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు..
- కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పెరిగిన రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూల్లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది.
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీపీ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
మరోవైపు, పుణ్యప్రదమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం రోజున కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. రుద్రుడు, త్రినేత్రుడు, భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ‘ఓం నమఃశివాయ’, ‘హర హర మహాదేవ’ మంత్రాలు అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి (స్వయంభూ) దేవాలయంలో వైభవం ఈరోజు ఉచ్ఛస్థితిలో నిలిచింది.వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని, జటాజూటధారి అయిన శివయ్యకు పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో, ఉసిరి కొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి, పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ పి. కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా, భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!