Nallari Brothers: ఎంత కాలానికో..! ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్..
నల్లారి బ్రదర్స్.. అంటే తెలియనివారుండరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. ఆయన సోదరుడు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. అయితే, ఈ అన్నదమ్ములు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.. చాలా కాలమంటే.. ఏకంగా సంవత్సరాలు గడిచిపోయింది.. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది.. ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్ అంటే.. ఏదో పొలిటికల్ మీటింగ్ అని మాత్రం అనుకోవద్దు.. ఎందుకంటే.. వారు ఓ శుభ కార్యానికి హాజరయ్యారు.. పీలేరులోని నల్లారి అభిమాని వివాహ వేడుకకు హాజరైన ఈ సోదరులు.. ఒకే ఫ్రేమ్లో కనిపించారు.. ఇక, చాలా ఏళ్ల తర్వాత సోదరులు ఇద్దరూ ఒకే వేదికపై ఇలా కనిపించడంతో.. నల్లారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: CM YS Jagan Golden Heart: మా కుమారుడిని బతికించాలని దంపతుల వినతి.. తానున్నానంటూ సీఎం జగన్ భరోసా
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
మొత్తంగా.. గత ఎన్నికల తర్వాత దూరంగా ఉంటూ వచ్చిన అన్నదమ్ములు.. ఇవాళ పీలేరులో జరిగిన నల్లారి అభిమాని వివాహ వేడుకలో ఒకే ఫ్రేమ్లో కనిపించారు.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు టీడీటీ ఇంఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలా ఒకే వేదికపై కనిపించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. కాగా, టీడీపీలో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న కిషోర్ కుమార్.. పీలేరులో కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. 2009 లో పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరిసారి విజయం సాధించారు.. ఇక, 2014లో తన సోదరుడు పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉన్న విభేదాలతోనే ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆయన కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. మరోవైపు, నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆ మధ్య ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో కలిసినా.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్గా లేని విషయం విదితమే.
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!