Naga Babu: అభిమానులకు రిక్వెస్ట్.. దయచేసి ఆ వార్తలు నమ్మవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా, జనసేన అభిమానులకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు. ఈనెల 17న తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నాగబాబు ఖండించారు. నిర్ధారణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్తలు ఇవ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏమైనా పర్యటనలు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేస్తుందని సూచించారు. తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని నాగబాబు కోరారు.
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ
Also Read
మరోవైపు చిత్తూరు జిల్లా జనసేన నేతలు శనివారం సాయంత్రం నాగబాబును కలిశారు. ఈ సందర్భంగా తమ జిల్లాలోని పలు సమస్యలను గురించి నాగబాబుకు వివరించారు. జిల్లాకు తలమానికమైన చక్కెర కర్మాగారం మూసివేతతో పాటు విజయా డైరీపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఆయన దృష్టి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం అయ్యే రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వాయు మార్గం ఉండి కూడా అభివృద్ధిలో వెనుకబడిన చిత్తూరును అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని వారు నాగబాబును కోరారు.
There is no Truth in the News regarding My visit to North Andhra on 17th of this month.
So please stop spreading unverified information on Media platforms.
The party will officially communicate the info regarding any schedules.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 15, 2022
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..