NTV Telugu Site icon

Nadendla Manohar: నోటికొచ్చిన హామీలతో మోసం చేశారు

Nadendla

Nadendla

ఏపీ సీఎంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్.

గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడు సీఎం జగనులో ఆందోళన మొదలైంది. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే జగనుకు తెలిసిన విద్య. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి.. తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. పైగా 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారన్నారు నాదెండ్ల మనోహర్.

రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని కూడా ఎందుకు పథకానికి దూరం చేశారో చెప్పాలి. 2021లో 1లక్ష 19వేల మందికి ఇస్తున్నామని చెప్పారు. 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా..? జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి. మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పలికే అర్హత సీబీఐ దత్తపుత్రుడికి ఉందా? నాయకర్ దానం చేసిన ఆస్తులను, భూములను వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్న విషయం జగనుకి తెలియదా? ఎం.ఎస్.ఎన్. ఛారిటీస్ కి సంబంధించిన భూమి తీసేసుకొని వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మించడానికి సిద్ధమైనవాళ్ళా ఆ మహాదాత గురించి చెప్పేది.

వైసీపీలో మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. ప్రతి యేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్… అదీ అరకొర ఉద్యోగాలు. వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని మాట తప్పారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు.ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి.. వాటిని ఎగ్గొట్టే పనిలో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడటం లేదు. వైసీపీ దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు.విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నాయి.ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు.మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.సీబీఐ దత్తపుత్రుడు, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చేతనైతే బాధల్లో ఉన్న రైతాంగం కన్నీరు తుడవండి. సీపీఎస్ రద్దు చేయండి.పెట్టుబడులు తీసుకురండి.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి.అర్థంపర్థంలేని విమర్శలు కట్టిపెట్టకపోతే ప్రజలే బలంగా సమాధానం చెబుతారని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్.

Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం