MVV Satyanarayana: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేధించారు.. నా ఫ్యామిలీ క్షేమం
MVV Satyanarayana Talks About His Family And Friend Kidnap: తన ఫ్యామిలీ, స్నేహితుడు కిడ్నాప్కు గురైన వ్యవహారంపై తాజాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితుడు సేఫ్గా ఉన్నారని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే ఈ కేసుని పోలీసులు ఛేధించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కిడ్నాపర్ హేమంత్తో తనకు ఎలాంటి పరిచయం లేదని, తన వద్ద అతనెప్పుడూ పని చేయలేదని, కేవలం డబ్బు కోసమే అతడు ఈ కిడ్నాప్కి పాల్పడ్డాడని క్లారిటీ ఇచ్చారు.
CM YS Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మూడు రోజుల క్రితం హేమంత్ అనే కిడ్నాపర్ ఋషికొండలో తన కుమారుడు ఉంటున్న ఇంట్లోకి చొరబడి, అతడ్ని నిర్బంధించాడని ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. అనంతరం తన కొడుకుతో ఫోన్ చేయించి, ఒంట్లో బాగోలేదని చెప్పి, తన భార్యను ఆ కిడ్నాపర్ ఇంటికి రప్పించాడని.. తన భార్య ఇంటికి చేరుకోగానే ఆమెని కూడా నిర్బంధించాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య, కొడుకు చేత తన స్నేహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ని సైతం ఇంటికి పిలిపించి.. అతడ్ని కూడా కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. వీరి ముగ్గురిని చిత్రహింసలకు గురి చేస్తూ.. ఆ కిడ్నాప్ డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. ఈ కిడ్నాప్ జరిగినప్పుడు తాను హైదరాబాద్లో ఉన్నానన్నారు.
Asia Cup 2023: పాక్లో నాలుగు, మిగిలినవన్నీ శ్రీలంకలోనే.. ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..
బుధవారం ఉదయం తాను జీవీతో ఫోన్లో మాట్లాడానని, తర్వాత మాట్లాడుతానంటూ జీవీ వెంటనే ఫోన్ కట్ చేశారని ఎంవీవీ చెప్పారు. తాను తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. చివరగా ఓసారి లిఫ్ట్ చేసి.. శ్రీకాకుళంలో ఇన్కమ్ టాక్స్ రైడ్స్ అవుతున్నాయని చెప్పి, ఫోన్ పెట్టేశారన్నారు. ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదని.. తనకు అనుమానం వచ్చి పోలీస్ కమీషనర్కి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. జీవీ నంబర్ ట్రాక్ చేయమని తాను కోరానని.. ఋషికొండలోనే లొకేషన్ చూపించిందని, దీంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ హేమంతే.. తన కుటుంబ సభ్యుల్ని బెదిరించి, ఫోన్ చేయించాడని ఎంవీవీ చెప్పారు.
Pawan Kalyan: వారి తిట్లకు చేతలతో సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
తన మీద పగ, ప్రతీకారంతో అతడు ఈ కిడ్నాప్ చేయలేదని, కేవలం డబ్బు కోసమే చేశాడన్నారు. అసలు హేమంత్తో తనకెలాంటి పరిచయం లేదన్నారు. హేమంత్పై గతంలోనూ కిడ్నాప్ కేసులతో పాటు ఓ మర్డర్ కేసు కూడా ఉందన్నారు. రియల్ ఎస్టేట్లో ఉన్న తన శతృవులు ఈ పని చేయించి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ఎందుకంటే, తనకు ఎవరితోనూ గొడవలు లేవన్నారు. హేమంత్ ఇంత డబ్బు కావాలని డిమాండ్ కూడా చేయలేదన్నారు. తన కొడుకుని 48 గంటలపాటు, భార్యకు 24 గంటలపాటు బంధించారన్నారు. తన కోడలు ఊరెళ్లడంతో సేఫ్ అయ్యిందని, లేకపోతే ఆమెని కూడా హింసించే వాళ్లన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో