Mutton Mafia: కుళ్ళిన మటన్ అమ్మకాలు.. బెజవాడలో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమందికి మటన్, చికెన్ ఇంట్లో వండకపోతే కుదరదు. ముద్ద దిగదు. అయితే మనం తినేది అసలు మంచి మటనేనా, కుళ్లిందా అని తెలుసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ముదురు మటన్ వాసన రాదు. తోక చిన్నగా ఉంటే లేతది అని.. తోక పెద్దగా ఉంటే ముదురు మటన్ అంటారు. కానీ మటన్ షాపు వాళ్లు తోకలు లేకుండానే మటన్ తెస్తుంటారు. కాస్త తక్కువ ధరకు దొరుకుతుంది కదాని కొనేసి ఇంటికి తీసికెళ్ళి మసాలా దట్టించి వండి లాగించేస్తారు. కుళ్ళిన మటన్ తింటే అనారోగ్యం గ్యారంటీ.
తాజాగా విజయవాడ నగరంలో భారీగా కుళ్ళిన మటన్ అమ్మకాలు సాగిస్తున్నారు మటన్ షాపు యజమానులు. తనిఖీల్లో కేజీల కొద్దీ పురుగుపట్టిన మాంసం బయట పడడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. పబ్లిక్ ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుళ్ళిన మాంసాన్ని కొని మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల తీరుపై జనం మండిపడుతున్నారు. డబ్బుల కోసం పాడైన పురుగుపట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నారు.
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఇంటి వద్ద గోనె సంచులలో ధర్మకోల్ బాక్స్ లలో సుమారు 100 కేజీల గొర్రె మరియు మేక మాంసము నిల్వను పట్టుకున్నారు అధికారులు. రాణి గారి తోట, భూపేష్ గుప్తా నగర్ వాటర్ ప్లాంట్ వద్ద విక్రయాలు చేస్తున్నవారిని శ్రీహరి మాణిక్యం రాము తండ్రి ఓబేశ్వరరావుగా అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాదిన పరచుకొని దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చేశారు అధికారులు. ఈ మాంసపు పదార్దములు వినుకొండ సంతలో చనిపోయిన గొర్రెలుగా గుర్తించారు. అక్కడ చనిపోయిన గొర్రెలను ప్రేగులను తొలగించి శుభ్రంగా శుభ్రపరచి పొట్టలో ఐస్ వేసి విజయవాడకు తీసుకుని వచ్చి అమ్మేస్తున్నాడా వ్యాపారి.
పూర్తిగా కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన మాంసంగా నిర్దారించారు. సంతలో చనిపోయిన గొర్రెలను సుమారు రూ. 1500/- నుండి 2000/- చొప్పున కొనుగోలు చేస్తారు వ్యాపారులు. వాటిని నగరానికి తరలించి ఇక్కడ మార్కెట్లో కేజీ రూ.800/- చొప్పున అమ్మకాలు చేస్తూ ఎడాపెడా అమ్మేస్తున్నారు. కృష్ణలంక రాణిగారి తోటలోని 5 షాపుల వారికి ఇటువంటి మాంసము విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో చెప్పారు వ్యాపారులు. దీంతో అధికారులువ వారిపై కేసులు నమోదుచేశారు.
Heavy Rains in Telangana: కురుస్తున్న వర్షాలు.. మూడు రోజులు భారీ వానలు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!