Peddireddy Mithun Reddy: దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Talks About Kuppam Bogus Vote: బోగస్ ఓట్లు తొలగింపుపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బోగస్ ఓట్లు అంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ వారు బలంగా ఉన్న చోట గతంలో బోగస్ ఓట్లు పెట్టుకున్నారని.. ఇప్పుడు అవే దొంగ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఓట్లు ఎప్పుడు నమోదు అయ్యాయో కూడా తమ వద్ద రికార్డ్ ఉందని అన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఓట్లు తొలగించి, దొంగ ఓట్లు సిద్దం చేసిన ఘనత టీడీపీదేనని ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగించాలని తామే ఎలక్షన్ కమిషన్ను కోరుతున్నామని పేర్కొన్నారు. కుప్పంలోనూ అనేక దొంగ ఓట్లు ఉన్నట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Perni Nani: టెట్ క్వాలిఫై కానివారు మెరిట్ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెట్టే దమ్ముందా?
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతీసారి ఎలా గెలుస్తున్నాడో తమకు అర్థం కాలేదని.. ఆ అనుమానంతోనే తాము ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని మిథున్ రెడ్డి అన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బోగస్ ఓట్లను నమోదు చేయించారని చెప్పారు. అయితే.. తాము గతంలో కొన్ని దొంగ ఓట్లను తొలగించామని స్పష్టం చేశారు. టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని హితవు పలికారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న విజయ డెయిరీను చంద్రబాబు మూసేశారని.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ డెయిరీని అమూల్ ద్వారా ప్రారంభించడానికి సిద్ధం చేశారని తెలిపారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి ఆ పనుల్ని ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. పాడి రైతులకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.
Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!