Peddireddy Mithun Reddy: దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Talks About Kuppam Bogus Vote: బోగస్ ఓట్లు తొలగింపుపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బోగస్ ఓట్లు అంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ వారు బలంగా ఉన్న చోట గతంలో బోగస్ ఓట్లు పెట్టుకున్నారని.. ఇప్పుడు అవే దొంగ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఓట్లు ఎప్పుడు నమోదు అయ్యాయో కూడా తమ వద్ద రికార్డ్ ఉందని అన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఓట్లు తొలగించి, దొంగ ఓట్లు సిద్దం చేసిన ఘనత టీడీపీదేనని ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగించాలని తామే ఎలక్షన్ కమిషన్ను కోరుతున్నామని పేర్కొన్నారు. కుప్పంలోనూ అనేక దొంగ ఓట్లు ఉన్నట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతీసారి ఎలా గెలుస్తున్నాడో తమకు అర్థం కాలేదని.. ఆ అనుమానంతోనే తాము ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని మిథున్ రెడ్డి అన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బోగస్ ఓట్లను నమోదు చేయించారని చెప్పారు. అయితే.. తాము గతంలో కొన్ని దొంగ ఓట్లను తొలగించామని స్పష్టం చేశారు. టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని హితవు పలికారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న విజయ డెయిరీను చంద్రబాబు మూసేశారని.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ డెయిరీని అమూల్ ద్వారా ప్రారంభించడానికి సిద్ధం చేశారని తెలిపారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి ఆ పనుల్ని ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. పాడి రైతులకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.
Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు
తాజావార్తలు
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!