Allu Arjun: “ఇండియన్ సినిమా షేక్.. అల్లు అర్జున్ – అట్లీ ‘మెగా మేగ్నమ్ ఓపస్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22/A6) ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సరికొత్త దృశ్య కావ్యంగా ఈ సినిమాను అట్లీ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ యాక్షన్, గుండెకు హత్తుకునే ఎమోషన్స్ సహా గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. అయితే ఈసారి అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్యారలల్ యూనివర్స్’ అనే కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఇండియా స్క్రీన్ పై ఒక కొత్త ప్రయోగానికి నాంది పలకనుంది.
Also Read:Himaja : నా క్యారెక్టర్పై కామెంట్స్ ఆపండి.. మా పేరెంట్స్ వింటే తట్టుకోలేరు – హిమజ
Also Read
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
- Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు విభిన్న పాత్రలలో (తాత, తండ్రి మరియు ఇద్దరు కొడుకులుగా) కనిపిస్తారని సమాచారం. ఇది బన్నీ కెరీర్లోనే అతిపెద్ద సవాల్గా నిలవనుంది.ఒక పాత్రను పూర్తిస్థాయి యానిమేటెడ్ రూపంలో తీర్చిదిద్దబోతున్నారని, ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసమని టాక్. అంతేకాక విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ చిత్ర బృందం ఇప్పటికే లాస్ ఏంజిల్స్లోని టాప్ VFX స్టూడియోలను సందర్శించింది. ‘అవతార్’ తరహా విజువల్ ఎక్స్పీరియన్స్ను ప్రేక్షకులకు అందించడమే అట్లీ లక్ష్యం అని అంటున్నారు.
Also Read:The Paradise : నాని ‘ప్యారడైజ్’ ఫస్ట్ లిరికల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రష్మికా మందన్న మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం, ఇది ఇండియన్ సినీ చరిత్రలో ఒక రికార్డు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!