AP Crime: దృశ్యం సినిమా స్టోరీని మరిపించే ట్విస్ట్.. కొడుకును కొట్టి చంపిన తల్లి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఓ హత్య కేసులో చుట్టూ తిరిగే దృశ్యం సినిమాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూపించారు దర్శకుడు.. ఈ తరహా ఘటనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి.. తాజాగా, కృష్ణ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ కసాయి త్లి.. రోకలిబండతో కొట్టి కొడుకు దీప్చంద్ను హత్య చేసిన ఆమె.. ఎవరూ చంపేశారంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు.. తల్లి ప్రవర్తనలో తేడాను గుర్తించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది..
Read Also: Valentine’s Day: వాలెంటైన్స్ డేని “కౌ హగ్ డే”గా జరుపుకోండి
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
గన్నవరం ఏసీపీ విజయపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొడుకు చేసిన అప్పులు కట్టలేక ఈ దారుణానికి ఒడిగట్టింది దీప్ చంద్ తల్లి రమా.. అప్పులు చేయడమే కాదు.. తల్లిని డబ్బులు కావాలి ఇస్తావా? చస్తావని వేధించడంతో.. ఆ వేధింపులు తట్టుకోలేక.. కొడుకునే కాటికి పంపాలని ప్లాన్ చేసింది.. నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో కొట్టి చంపేసింది.. ఉదయం 5.30 గంటలకు మృతుడి తండ్రి లేచి పనికి వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో మోదీ చంపేసింది తల్లి.. అయితే, అనంతరం తలుపు వేసి తల్లి బయటికి వెళ్లి పశువుల దగ్గర పని చూసుకుంది.. ఉదయం 6:30 గంటలకు పాలు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది.. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి ఎవరో వచ్చి.. మన అబ్బాయిని కొట్టి వెళ్లిపోయారు.. రక్తం మడుగులో పడి ఉన్నాడు అని సమాచారం చేరవేసింది.. ఎవరో వచ్చి కొట్టి చంపినట్టు గ్రామస్తుల్ని, పోలీసుల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, తన కూతురు కుమార్తెను తానే చూసుకుంటున్న నిందితురాలు.. ఆ పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించేసింది.. కొడుకు చనిపోతే.. మనవరాలిని ఎలా స్కూల్కు పంపించింది..? అనే విషయంలో పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో, ఆమెను తమదైన శైలిలో విచారించగా.. నేనే కొట్టి చంపానని అంగీకరించింది తల్లి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!