MLC Election Results: రేపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రతా
- రేపు ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
- ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు..
- స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడంచల భద్రత ఏర్పాటు చేసిన ఈసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Election Results: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే, ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు (మార్చ్ 3వ తేదీ) తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.
Read Also: NKR 21: కళ్యాణ్ రామ్ సినిమా ఇన్ సైడ్ టాక్..
Also Read
ఇక, రేపు గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్ కు ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒకటవ ప్రాధాన్యత ఓట్ లో ఎవరైనా అభ్యర్థికి 50 శాతానికి మించి మెజారిటీ రాకపోతే, రెండవ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే, బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే, రెండు రోజులు కూడా పట్టే అవకాశం ఉండటంతో.. 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే, ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొనింది.
Read Also: Britain- Ukraine: ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం
అయితే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 లక్షల 18 వేల 902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 17 రౌండ్లులలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు.. చెల్లుబాటు కానీ ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
Read Also: Fake Darshan Tickets: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు.. పోలీసులకు వరుస ఫిర్యాదులు
మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆంధ్రా యూనివర్శిటీ ఈఈఈ బిల్డింగ్ లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే.. ఫలితం మరింత ఆలస్యం కావొచ్చు అని ఈసీ పేర్కొనింది. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే.. సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందనీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!