ఏపీలో వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గణేష్. నిరంతరం ప్రభుత్వం మీద ఏదోవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత అయ్యన్నకు లేదన్నారు.
విలేఖర్లకు పంపిన వీడియోలో టీడీపీ నేతలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు కేవలం రూ. 12 కోట్లు మీరు బిల్లులు చేస్తే, మా ప్రభుత్వంలో రూ. 5 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం అన్నారు గణేష్. ఆర్ అండ్ బీ శాఖలో పెండింగ్ బిల్లులు 14 పనులకు గాను రూ. 3.82 కోట్లు మా ప్రభుత్వం చెల్లింపులు చేసింది..
టిడిపి నేతలు చేతనైతే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కాంట్రాక్టు పనులకు కమిషన్ లేకుండా బిల్స్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. కమిషన్లతో కోట్లు గడించిన మీరు బిల్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.అయ్యన్నపాత్రుడు రోజుకొక మారు మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలి.రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది టీడీపీ నేతలు కాదా? అని గణేష్ ప్రశ్నించారు.