Minister Vidadala Rajini: అధికారం లేనప్పుడే టీడీపీకి బీసీలపై ప్రేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నిన్న జయహో బీసీ సభలో తొక్కిసలాటలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఎన్నికల సమయంలో,అధికారం కోసం మాత్రమే టీడీపీకి బీసీలు గుర్తుకువస్తారన్నారు మంత్రులు జోగి రమేష్, విడదల రజిని. జయహో బీసీ సభ సక్సస్ కావడంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.బీసీల సభ పెట్టడం టీడీపీకి ఇష్టం లేదా..?ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగింది.బీసీలుగా సభ నిర్వహించుకోవడం కొంత మందికి నచ్చడం లేదు.
జయహో బీసీ సభను వెకిలి చేష్టలతో అవమానిస్తారా..?బీసీలను హేళన చేసి ఏం మెసేజ్ ఇద్దామని టీడీపీ అనుకుంటోంది.చంద్రబాబు మీద ప్రేమ ఉంటే వేరేలా చూడాలి కానీ ఇలా అవమానకర రీతిలో చూడొద్దని హెచ్చరిస్తున్నామన్నారు మంత్రి జోగి రమేష్. జయహో బీసీ సభకు వచ్చి గాయపడిన వారికి చికిత్స అందుతుంది .ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు మరో మంత్రి విడదల రజిని. వైసీపీ పూర్తిగా బాధితులకు అండగా ఉంటుంది. సీఎం మీద ఉన్న ప్రేమతో సభకు వచ్చామని చెప్పారు. టీడీపీ నేతలకు బురద జల్లే రాజకీయం అలవాటైంది. బీసీల గురించి టీడీపీకి ఏ మాత్రం పట్టదు. అధికారంలో ఉన్నప్పుడే టీడీపీకి మహిళలు, బీసీలు గుర్తుకొస్తారా..? అని ఆమె మండిపడ్డారు.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
Read Also: Rohit Sharma: అప్పుడు ధోనీ.. ఇప్పుడు రోహిత్.. అత్యంత చెత్త రికార్డ్
బెజవాడలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. జయహో బీసీ నినాదం.. విజయవాడలో హోరెత్తింది. చిత్తూరు నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని జిల్లాల నుంచి దాదాపు 85 వేల మంది బీసీ ప్రతినిధులు ఈ సభకు హాజరై జయహో బీసీ- జయహో జగనన్న అంటూ నినదించారు. గ్రామ పంచాయతీలోని వార్డు స్థాయి సభ్యుడి నుంచి రాజ్యసభ సభ్యుల వరకూ సుమారు 85 వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. జయహో బీసీ- జై జగన్, జయహో జగన్.. అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, గ్రామ స్థాయి వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు వరకు వివిధ పదవుల్లో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!