Venugopala Krishna: కోనసీమ జిల్లాకు పేరు మార్చడం అభినందనీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ గుర్తు చేశారు. వారి విజ్ఞప్తులను సీఎం జగన్ స్వీకరించి అందరికీ సమానుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును కోనసీమకు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని… దళితులంతా సంబరాలు జరుపుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోనసీమ జిల్లా పేరు మార్పు
బీసీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కృష్ణయ్యకు రాజ్యసభ సీటిస్తే చంద్రబాబు అవమానించారని మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు వంచిస్తే జగన్ రాజ్యసభ సీటిచ్చి గౌరవించారన్నారు. తన హయాంలో ఒక్క బీసీకీ రాజ్యసభ అవకాశం చంద్రబాబు ఇవ్వలేదన్నారు. తెలంగాణ నేతలకు సీట్లు ఇచ్చారని, అమ్ముకున్నారని చంద్రబాబు ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కేవలం కంటగింపు, బాధతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బీసీలకు రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల బీసీలందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
కాగా మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడ్డట్టు కొన్ని ఛానళ్లలో చూపిస్తున్నారు తప్ప నిజానికి జనం తిరగబడటం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంత మంది పౌరులకు ప్రభుత్వం నుంచి ఏం వస్తుంది, ఏం పొందాలి అనే విషయాలపై అవగాహన రాహిత్యం ఉందని.. అందువల్ల కొందరు ప్రజలు మన ఎమ్మెల్యేనే కదా అని అడిగే విధానంలో తేడా ఉంటోందని.. కొందరు ఆగ్రహంతో మాట్లాడుతుండటాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!