Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Roja Sensational Comments On Tdp

Minister Roja: రోజా సంచలన వ్యాఖ్యలు.. టచ్ చేసి చూడు

Published Date :September 15, 2022 , 11:31 am
By NTV WebDesk
Minister Roja: రోజా సంచలన వ్యాఖ్యలు.. టచ్ చేసి చూడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Roja Sensational Comments On TDP: ఏపీ మంత్రి రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులకు పనీ పాట లేదని, వారి ఛానల్స్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. ఉద్యోగాల గురించి అడిగే అర్హత చంద్రబాబుకు లేదని, తన హయాంలో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి 80 లక్షల ఇళ్లున్నాయని.. ఎంతమందికి బాబు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు నిరుద్యోగ భృతి ఇచ్చారని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. టీడీపీకి బుద్దొచ్చే విధంగా లక్షా 21 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానిదే అని.. టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగితే, ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో 42 వేల పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.

మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి రోజా తెలిపారు. మూడు రాజధానుల అంశం లేవనెత్తిన తర్వాత.. వచ్చిన ప్రతి ఎన్నికల్లో తామే గెలిచామన్నారు. రాజధానిలో ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను సైతం వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. మీరు (టీడీపీ) న్యాయం చేయలేరు కాబట్టే ప్రజలు తమని గెలిపించారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 26 గ్రామాల్లో రాజధాని కావాలంటున్నారని చెప్పిన రోజా.. 26 జిల్లాల్లో టీడీపీని ప్రజలు కూకటి వేళ్లతో పీకి పారేస్తారని హెచ్చరించారు. ‘దమ్ముంటే రాజీనామా చేయండి.. అసెంబ్లీ రద్దు చేయండి’ అని తమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అమరావతి కావాలా, మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడిపి నేతలు అడగాలన్నారు. ఇదే సమయంలో నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు. లోకేష్ ఒక పిల్లి పిత్రి అని.. తల్లి, భార్య సహాయంతో చంద్రబాబును బెదిరించి, దొడ్డి దారిన మంత్రి అయ్యాడని, అలాంటి నువ్వు సీఎం జగన్‌ని విమర్శిస్తావా? అంటూ రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ ఒక అడ్రస్ లేని వెధవ అని.. ఏది పడితే అది మాట్లాడితే జనాలు కొట్టిస్తామని రోజా వార్నింగ్ ఇచ్చారు.

Also Read

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

తాను, కొడాలి నాని టీడీపీ నుంచే వచ్చామని.. నాడు ఎన్టీ రామారవు అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నామని రోజా చెప్పారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించిన ఆమె.. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరన్నారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైకు వస్తే తరిమి తరిమి కొడతామన్నారు. జగనన్న కోసం తాము ప్రాణాలివ్వడానికైనా సిద్ధమన్నారు. మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని టిడిపిఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉంది కాబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోందన్నారు. అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Minister Roja
  • Chandrababu Naidu
  • Nara Lokesh
  • YS Jagan Mohan Reddy
  • YSR Congress Party

తాజావార్తలు

  • Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి

  • Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions