Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా, ఎమ్మెల్యే బాలకృష్ణ
Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. విజయదశమి కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే భవానీలు ఇరుముడి సమర్పించేదుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు కావటంతో రూ.300, రూ.100 టికెట్ దర్శనాలను అధికారులు నిలిపివేశారు.
Read Also: Rohit Sharma: అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
Also Read
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
- YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్.!
- Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా
అటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు బాలయ్యకు వేద ఆశీర్వచనం చేశారు. ఆయనకు ఆలయ అధికారులు అమ్మ వారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులపై ఉండాలని, రాష్ట్రాభివృద్ది జరిగి ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని బాలయ్య మీడియాకు తెలిపారు. కాగా ఏపీ ప్రజలకు బాలకృష్ణ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రి రోజా కూడా దర్శించుకున్నారు. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ దీవెనలతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. వికేంద్రీకరణ జరగాలని అమ్మను వేడుకున్నానని.. వికేంద్రీకరణకు న్యాయపరమైన చిక్కులు వీడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మ మొక్కు తీర్చుకుంటానని మంత్రి రోజా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!