Minister RK Roja: రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అనే విమర్శలకు ఇదే నా సమాధానం..
Minister RK Roja: విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్ఐ) విజయవంతం కావడంతో.. సంబరాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇప్పటికే సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది.. ఇక, పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు మంత్రి రోజా.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అని విమర్శించేవారికి ఇదే నా సమాధానంగా చెప్పుకొచ్చారు.. పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. టూరిజంలోకి చాలా పెట్టుబడులు వచ్చాయి అని ఆనందం వ్యక్తం చేశారు.. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థమైంది.. గతంలో పెట్టుబడుల సదస్సుల్లో జరిగిన ఎంవోయూలు కాగితాలకే పరిమితం అయ్యేవి… కానీ, పెట్టుబడుల సదస్సుకు వచ్చిన బడా పారిశ్రామిక వేత్తలు చూస్తేనే ఎంత సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ఇక, పెట్టుబడుల సదస్సు జరిగిన తీరు చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యిందన్నరు మంత్రి రోజా.. పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కోవిడ్ లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదన్న ఆమె.. కరెక్ట్ టైంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించాం.. టూరిజం శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజా టూరిస్టా..? టూరిజం శాఖ మంత్రా అని విమర్శలు చేసే వారికి ఇదే సమాధానంగా స్పష్టం చేశారు.. కాకినాడలో డెస్టినేషన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి.. దేవభూమి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో రోప్ ప్రాజెక్టులు.. విశాఖలో సఫారీ ప్రాజెక్టు రాబోతోందన్నారు. పిల్ల పిత్రే పెట్టుబడుల సదస్సును ఫేక్ సదస్సు అన్నాడు.. కానీ, చంద్రబాబు ఈ స్థాయిలో ఏనాడైనా పారిశ్రామిక వేత్తలను ఒకే స్టేజ్ మీదకు తెచ్చారా..? అని నిలదీశారు. పెట్టుబడుల సదస్సుకు విమర్శలు చేసే వారు వచ్చుంటే సెల్ఫీ తీయించి పంపేవాళ్లం అంటూ సెటైర్లు వేశారు. పెట్టుబడుల సదస్సుతో జగన్ ఇమేజ్ పెరిగిందన్నారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: B Pharmacy Student Collapse: మరో గుండె ఆగింది.. కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీఫార్మసీ విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఏపీ రిలిజియస్ టూరిజంలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు.. జనరల్ టూరిజంలో మూడో స్థానంలో ఉన్నాం.. టూరిజం రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలోనూ టూరిజం రంగానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు రజత్ భార్గవ.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో