Minister RK Roja: రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అనే విమర్శలకు ఇదే నా సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్ఐ) విజయవంతం కావడంతో.. సంబరాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇప్పటికే సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది.. ఇక, పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు మంత్రి రోజా.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అని విమర్శించేవారికి ఇదే నా సమాధానంగా చెప్పుకొచ్చారు.. పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. టూరిజంలోకి చాలా పెట్టుబడులు వచ్చాయి అని ఆనందం వ్యక్తం చేశారు.. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థమైంది.. గతంలో పెట్టుబడుల సదస్సుల్లో జరిగిన ఎంవోయూలు కాగితాలకే పరిమితం అయ్యేవి… కానీ, పెట్టుబడుల సదస్సుకు వచ్చిన బడా పారిశ్రామిక వేత్తలు చూస్తేనే ఎంత సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఇక, పెట్టుబడుల సదస్సు జరిగిన తీరు చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యిందన్నరు మంత్రి రోజా.. పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కోవిడ్ లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదన్న ఆమె.. కరెక్ట్ టైంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించాం.. టూరిజం శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజా టూరిస్టా..? టూరిజం శాఖ మంత్రా అని విమర్శలు చేసే వారికి ఇదే సమాధానంగా స్పష్టం చేశారు.. కాకినాడలో డెస్టినేషన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి.. దేవభూమి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో రోప్ ప్రాజెక్టులు.. విశాఖలో సఫారీ ప్రాజెక్టు రాబోతోందన్నారు. పిల్ల పిత్రే పెట్టుబడుల సదస్సును ఫేక్ సదస్సు అన్నాడు.. కానీ, చంద్రబాబు ఈ స్థాయిలో ఏనాడైనా పారిశ్రామిక వేత్తలను ఒకే స్టేజ్ మీదకు తెచ్చారా..? అని నిలదీశారు. పెట్టుబడుల సదస్సుకు విమర్శలు చేసే వారు వచ్చుంటే సెల్ఫీ తీయించి పంపేవాళ్లం అంటూ సెటైర్లు వేశారు. పెట్టుబడుల సదస్సుతో జగన్ ఇమేజ్ పెరిగిందన్నారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: B Pharmacy Student Collapse: మరో గుండె ఆగింది.. కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీఫార్మసీ విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఏపీ రిలిజియస్ టూరిజంలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు.. జనరల్ టూరిజంలో మూడో స్థానంలో ఉన్నాం.. టూరిజం రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలోనూ టూరిజం రంగానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు రజత్ భార్గవ.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!