Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Peddireddy Ramachandrareddy Review Meeting On Energy Department

PeddiReddy: ఏపీలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రానివ్వకూడదు

Published Date :September 6, 2022 , 9:46 pm
By Ramesh Nalam
PeddiReddy: ఏపీలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రానివ్వకూడదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister PeddiReddy Ramachandra Reddy: ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇంధన, గనులు, ఎపిఎండిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఇడిసిఎపి రూపొందించిన హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతులు చేసుకుంటున్నామన్నారు.

ఏపీఎండీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గురంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీఎండీసీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకవైపు బొగ్గు ఉత్పత్తిపై ఏపీఎండీసీ దృష్టి సారించాలని, అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని, ఇంధన, గనులశాఖ అధికారులు దీనిపై సంయుక్తంగా ముందుకు సాగాలని సూచించారు.

Also Read

  • Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!
  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
  • CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..

Read Also: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే..?

ఇంధనశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని, హేతుబద్ధంగా అవసరమైన పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖలో కూడా పునర్ వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్ లను ఇవ్వడంలో ఎటువంటి అలసత్వంను సహించేంది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్‌లను జారీ చేసే విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. అలాగే వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయాలని సూచించారు. మీటర్ల వల్ల రైతులపై ఎటువంటి భారం పడదని, కావాలని విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వ్యవసాయానికి నికరంగా ఎంత విద్యుత్ వాడుతున్నారో మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల తెలుస్తుందన్నారు. ఉచితంగా క్వాలిటీ విద్యుత్‌ను వ్యవసాయానికి అందించడానికి మరింత వీలవుతుందన్నారు. ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. లీగల్ విభాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ కేసులను పరిష్కరం కోసం కృషి చేయాలని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • coal
  • Minister Peddireddy
  • peddireddy Ramachandra Reddy
  • review meeting

తాజావార్తలు

  • IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో

  • AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?

  • Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!

  • Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..

  • Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions