Minister Nimmala: జగన్ వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుబడుతున్నారు: మంత్రి నిమ్మల
- జగన్ వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుబడుతున్నారు..
- రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే వచ్చింది..
- ఐదేళ్లలో రాయలసీమకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలి..
- ఐదేళ్లు సినిమా సెట్టింగ్ లతో కాలం గడిపారు..
- ఐదేళ్లలో మీరు చేయని పనులను చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశారు: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పు పడుతున్నారు అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమలో ప్రతి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలోనే వచ్చాయి.. ఇవాళ వైసీపీ తమను ప్రశ్నిస్తోంది కదా.. గత ఐదేళ్లలో రాయలసీమకు మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సినిమా సెట్టింగులు వేసి.. పూర్తి కానీ ప్రాజెక్టులను ప్రారంభించారని ఆరోపించారు. వైసీపీ పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు.. ఏపీ ప్రజలు తెలివైనవాళ్లు.. ఎవరికి ఎలా నష్టం జరిగిందో తెలుసని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు చూస్తే ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తు వస్తారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
Read Also: Suresh Kumar C : టాలీవుడ్ నటుడు ఆకస్మిక మృతి
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఇక, జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని ఉపయోగించుకున్నా, 79 శాతం నీరు ఇంకా రాయలసీమలో నిల్వ ఉందని నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకృష్ణదేవ రాయలు కాలంలో మా చెరువులు కళకళ లాడాయి.. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని రాయలసీమ వాసులు చెబుతున్నారు.. రాయలసీమ బిడ్డా అని చెప్పుకుంటూ కనీసం ఒక్క పంపు ఉపయోగించలేదన్నారు. ఐదేళ్లలో హంద్రీనీవా బిల్లులు ఎగ్గొట్టారని విమర్శించారు. ఐదేళ్లలో హంద్రీనీవాకు వైసీపీ చేయని పనులు ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు చేశారని పేర్కొన్నారు. జగన్ హయంలో హంద్రీనీవాకు 514 కోట్లు ఇచ్చారు.. కూటమి సర్కార్ ఏడాదిన్నరలో రూ. 3148 కోట్లు ఇచ్చిందని చెప్పారు. జగన్ హయాంలో ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని మంత్రి నిమ్మల వెల్లడించారు.
అయితే, జగన్ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టులో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో అందరు చూశారని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్ కి చేసిన ద్రోహంతో గ్రామాలు కొట్టుకుపోయిన పరిస్థితితో 38 మంది వరకు చనిపోయారని ఆరోపించారు. కనీసం వారిని చూడటానికి కూడా జగన్ వెళ్ళలేదని ఎద్దేవా చేశారు. గోరకల్లులో రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని అధికారులు తెలియజేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గోరకల్లు రిజర్వాయర్ కి ఇప్పుడు టెండర్లు పిలిచి వాటిని రిపేర్ చేయిస్తున్నామని మంత్రి నిమ్మల తెలియజేశారు.
- Tags
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?