Kottu Satyanarayana: పవన్ కల్యాణ్ది మా సామాజిక వర్గం.. నాకు అభిమానం ఉండదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు.. కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదని స్పష్టం చేశారు.. పవన్ వెనక తిరిగే వారికి మాత్రమే పవన్ సీఎం కావాలనే కోరిక ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై స్పందిస్తూ.. చంద్రబాబుతో పవన్ పొత్తు అపవిత్ర కలయికగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
మరోవైపు.. విజయనగరం దేవదాయ శాఖ ఏసీ పరిధి దాటారని ఫైర్ అయ్యారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పరిధి దాటిన ఏసీపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. దేవాలయాల భూములను కాపాడడం మా బాధ్యత.. పీఠాధిపతులు.. మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.. త్వరలో తేదీ ఖరారు చేస్తాం అన్నారు.. హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చిస్తాం అన్నారు. రూ. 249 కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.. వీటిలో చాలా వరకు టెండర్లు పిలిచాం అన్నారు.. సీజీఎఫ్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్ధి చేపడుతున్నాం.. సీజీఎఫ్ నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణపై ప్రతి 15 రోజులకూ సమీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. ఆలయాల నుంచి సీజీఎఫ్ నిధులు జమ అవుతున్నాయని.. 13 మందితో ఆగమ సలహాదారుల బోర్డు ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఏపీలో బలవంతపు మత మార్పిళ్లు జరగడం లేదన్నారు.. బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయనే అంశం మా దృష్టికి రాలేదని.. దేవాదాయ శాఖలో పని చేసే వారిలో దళితులే ఎక్కువ శాతం మంది ఉన్నారని వెల్లడించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!