Karumuri Nageswararao: పవన్.. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswararao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పవన్ కళ్యాణ్ కాల్షీట్ ముగిసిందని.. అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ మండిపడ్డారు. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అంటూ ఫైరయ్యారు.
ఇప్పటి వరకు నిర్వహించిన జనవాణి కార్యక్రమాలను ప్రభుత్వం సహకరించకుండానే పవన్ కళ్యాణ్ ఎలా నిర్వహించారా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. తాము ప్రజామద్దతుతో ఎన్నికయ్యామని.. తమను కొడితే రాష్ట్ర ప్రజలను కొట్టినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఎంతమంది తాట తీశారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ప్రజలపైనే దాడి చేసే స్థాయికి వెళ్లారని చురకలు అంటించారు. ఇప్పటివరకు ఉన్న ముసుగు తొలగిందని.. ప్యాకేజీ, దత్తపుత్రుడు అన్న మాటలను పవన్ నిజమే అని స్పష్టం చేశారని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
అటు వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి విడదల రజినీ ఆరోపించారు. పవన్ మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఒకేసారి రెండు నియోజవర్గాల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే ఉంటుందని.. ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్ధమైందని మంత్రి విడదల రజినీ తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..