Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూస్తే తమకు భయం ఎందుకని.. సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరైన మనిషి జగన్ అని తెలిపారు. టీడీపీ పడిపోయిన పార్టీ అని.. మోపులు కట్టినా.. బుల్డోజర్లు కట్టి లాగినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. దత్తపుత్రుడు వచ్చినా ఆ పార్టీని మళ్లీ లేపలేడని జోగి రమేష్ అన్నారు.
Read Also: Nitin Gadkari : తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి
Also Read
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
- Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఒక పద్ధతి, నిబంధనలు ఉండవన్నారు. కుప్పం ప్రజల ప్రాణాలు తీయాలని చంద్రబాబు చూస్తున్నారని.. దేశంలో ఎక్కడైనా 1861 పోలీస్ యాక్టునే ఫాలో అవుతున్నారని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబు ఏమైనా సొంత చట్టాలు తయారుచేసుకున్నారా అని నిలదీశారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. నిత్యానంద స్వామిలా చంద్రబాబు కూడా ఒక దీవి కొనుగోలు చేసి ఉండాలని చురకలు అంటించారు. చంద్రబాబు ఏది పడితే అది చేస్తామంటే కుదరదన్నారు. అటు ఒక ఓటు గానీ సీటు గానీ లేని బీజేపీ గురించి ఏం మాట్లాడతామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అస్థిత్వం కోసం కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఒకటి మాట్లాడతారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!