Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూస్తే తమకు భయం ఎందుకని.. సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరైన మనిషి జగన్ అని తెలిపారు. టీడీపీ పడిపోయిన పార్టీ అని.. మోపులు కట్టినా.. బుల్డోజర్లు కట్టి లాగినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. దత్తపుత్రుడు వచ్చినా ఆ పార్టీని మళ్లీ లేపలేడని జోగి రమేష్ అన్నారు.
Read Also: Nitin Gadkari : తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఒక పద్ధతి, నిబంధనలు ఉండవన్నారు. కుప్పం ప్రజల ప్రాణాలు తీయాలని చంద్రబాబు చూస్తున్నారని.. దేశంలో ఎక్కడైనా 1861 పోలీస్ యాక్టునే ఫాలో అవుతున్నారని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబు ఏమైనా సొంత చట్టాలు తయారుచేసుకున్నారా అని నిలదీశారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. నిత్యానంద స్వామిలా చంద్రబాబు కూడా ఒక దీవి కొనుగోలు చేసి ఉండాలని చురకలు అంటించారు. చంద్రబాబు ఏది పడితే అది చేస్తామంటే కుదరదన్నారు. అటు ఒక ఓటు గానీ సీటు గానీ లేని బీజేపీ గురించి ఏం మాట్లాడతామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అస్థిత్వం కోసం కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఒకటి మాట్లాడతారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!