Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూస్తే తమకు భయం ఎందుకని.. సంక్షేమ పథకాలతో పేదలకు దగ్గరైన మనిషి జగన్ అని తెలిపారు. టీడీపీ పడిపోయిన పార్టీ అని.. మోపులు కట్టినా.. బుల్డోజర్లు కట్టి లాగినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. దత్తపుత్రుడు వచ్చినా ఆ పార్టీని మళ్లీ లేపలేడని జోగి రమేష్ అన్నారు.
Read Also: Nitin Gadkari : తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఒక పద్ధతి, నిబంధనలు ఉండవన్నారు. కుప్పం ప్రజల ప్రాణాలు తీయాలని చంద్రబాబు చూస్తున్నారని.. దేశంలో ఎక్కడైనా 1861 పోలీస్ యాక్టునే ఫాలో అవుతున్నారని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబు ఏమైనా సొంత చట్టాలు తయారుచేసుకున్నారా అని నిలదీశారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. నిత్యానంద స్వామిలా చంద్రబాబు కూడా ఒక దీవి కొనుగోలు చేసి ఉండాలని చురకలు అంటించారు. చంద్రబాబు ఏది పడితే అది చేస్తామంటే కుదరదన్నారు. అటు ఒక ఓటు గానీ సీటు గానీ లేని బీజేపీ గురించి ఏం మాట్లాడతామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అస్థిత్వం కోసం కన్నా లక్ష్మీనారాయణ ఏదో ఒకటి మాట్లాడతారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..