Dadisetti Raja: అమలాపురం కుట్ర వెనుక చంద్రబాబు, పవన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్, సీఎంలు జగన్, కేసీఆర్కి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబే విలన్గా పేర్కొన్న ఆయన.. ఈ ఘటనలో కుట్రకోణం ఉందన్నారు. తుని ఘటన జరగడానికి కారణం చంద్రబాబే.. ఈ రోజు అమలాపురంలో విధ్వంసానికి కూడా చంద్రబాబే కారణం అన్నారు.
Read Also: GVL: అంబేద్కర్పై ప్రేమ ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా..?
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
ఇక, తుని ఘటన ఏ విధంగా ప్రీ ప్లాన్గా చేశారో… ఈ రోజు అమలాపురంలో కూడా ప్రీ ప్లాన్డ్ గానే మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారని మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా.. ప్రశాంతమైన కోనసీమ వాతావరణాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెడగొడుతున్నారని ఆరోపించిన ఆయన.. అంబేద్కర్ జిల్లాగా మార్చాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరలేదా? అని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం చాలా దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు..వ్యవస్ధల మీద భయం లేకపోవడం వల్లే చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అమలాపురం ఘటనలో ప్రభుత్వం సమన్వయంగానే వ్యవహరించిందన్నారు మంత్రి దాడిశెట్టి.. నిన్నటి ఘటనలో జనసేన కార్యకర్తలే పాల్గొన్నారని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సాయంతోనే ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారని.. తనకి ఆదరణ లేదని అసూయతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, మంగళవారం ఉద్రిక్తంగా మారిన అమలాపురం.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. మరోసారి ఆందోళనలు, నిరసనలకు అవకాశం ఉండడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
-
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!