Dadisetti Raja: అమలాపురం కుట్ర వెనుక చంద్రబాబు, పవన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్, సీఎంలు జగన్, కేసీఆర్కి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబే విలన్గా పేర్కొన్న ఆయన.. ఈ ఘటనలో కుట్రకోణం ఉందన్నారు. తుని ఘటన జరగడానికి కారణం చంద్రబాబే.. ఈ రోజు అమలాపురంలో విధ్వంసానికి కూడా చంద్రబాబే కారణం అన్నారు.
Read Also: GVL: అంబేద్కర్పై ప్రేమ ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా..?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇక, తుని ఘటన ఏ విధంగా ప్రీ ప్లాన్గా చేశారో… ఈ రోజు అమలాపురంలో కూడా ప్రీ ప్లాన్డ్ గానే మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారని మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా.. ప్రశాంతమైన కోనసీమ వాతావరణాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెడగొడుతున్నారని ఆరోపించిన ఆయన.. అంబేద్కర్ జిల్లాగా మార్చాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరలేదా? అని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం చాలా దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు..వ్యవస్ధల మీద భయం లేకపోవడం వల్లే చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అమలాపురం ఘటనలో ప్రభుత్వం సమన్వయంగానే వ్యవహరించిందన్నారు మంత్రి దాడిశెట్టి.. నిన్నటి ఘటనలో జనసేన కార్యకర్తలే పాల్గొన్నారని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సాయంతోనే ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారని.. తనకి ఆదరణ లేదని అసూయతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, మంగళవారం ఉద్రిక్తంగా మారిన అమలాపురం.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. మరోసారి ఆందోళనలు, నిరసనలకు అవకాశం ఉండడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!