Minister Botsa: మధురవాడ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. టీడీపీ హయాంలో ఈ భూముల రెగ్యులరైజేషన్ కోసం టుమెన్ కమిటీని వేసిందని.. వేల్యూషన్ చేయించి NCCకి విక్రయించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందన్న NCC రిక్వెస్ట్ ఆధారంగా జీపీఏకు చంద్రబాబు అనుమతి ఇచ్చారన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం NCCకి ఇచ్చేందుకు జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స వెల్లడించారు. జీవో నెంబర్ 67ప్రకారం మొత్తం భూమి నిమిత్తం 197కోట్ల రూపాయలు NCC కంపెనీ చెల్లించిందన్నారు. ఈ లావాదేవీలు అన్నీ గత ప్రభుత్వం, చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కేటాయింపులు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జీవోలు అందుబాటులో ఉన్నాయని.. దోపిడీకి ప్రయత్నం చేసి ఇప్పుడు టీడీపీ నాయకులు నంగనాచుల్లా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగింది NCC వైజాగ్ అర్బన్ డవలపర్స్ కంపెనీకి మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉల్లంఘన జరిగిందా.. లేదా అనేది అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ప్రాజెక్టు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
https://ntvtelugu.com/entrance-tests-dates-confirmed-by-andhra-pradesh-higher-education-department/
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!