Minister Botsa: మధురవాడ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. టీడీపీ హయాంలో ఈ భూముల రెగ్యులరైజేషన్ కోసం టుమెన్ కమిటీని వేసిందని.. వేల్యూషన్ చేయించి NCCకి విక్రయించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందన్న NCC రిక్వెస్ట్ ఆధారంగా జీపీఏకు చంద్రబాబు అనుమతి ఇచ్చారన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం NCCకి ఇచ్చేందుకు జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స వెల్లడించారు. జీవో నెంబర్ 67ప్రకారం మొత్తం భూమి నిమిత్తం 197కోట్ల రూపాయలు NCC కంపెనీ చెల్లించిందన్నారు. ఈ లావాదేవీలు అన్నీ గత ప్రభుత్వం, చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కేటాయింపులు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జీవోలు అందుబాటులో ఉన్నాయని.. దోపిడీకి ప్రయత్నం చేసి ఇప్పుడు టీడీపీ నాయకులు నంగనాచుల్లా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగింది NCC వైజాగ్ అర్బన్ డవలపర్స్ కంపెనీకి మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉల్లంఘన జరిగిందా.. లేదా అనేది అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ప్రాజెక్టు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
https://ntvtelugu.com/entrance-tests-dates-confirmed-by-andhra-pradesh-higher-education-department/
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!