Minister Botsa: మధురవాడ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. టీడీపీ హయాంలో ఈ భూముల రెగ్యులరైజేషన్ కోసం టుమెన్ కమిటీని వేసిందని.. వేల్యూషన్ చేయించి NCCకి విక్రయించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందన్న NCC రిక్వెస్ట్ ఆధారంగా జీపీఏకు చంద్రబాబు అనుమతి ఇచ్చారన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం NCCకి ఇచ్చేందుకు జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స వెల్లడించారు. జీవో నెంబర్ 67ప్రకారం మొత్తం భూమి నిమిత్తం 197కోట్ల రూపాయలు NCC కంపెనీ చెల్లించిందన్నారు. ఈ లావాదేవీలు అన్నీ గత ప్రభుత్వం, చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కేటాయింపులు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జీవోలు అందుబాటులో ఉన్నాయని.. దోపిడీకి ప్రయత్నం చేసి ఇప్పుడు టీడీపీ నాయకులు నంగనాచుల్లా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగింది NCC వైజాగ్ అర్బన్ డవలపర్స్ కంపెనీకి మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉల్లంఘన జరిగిందా.. లేదా అనేది అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ప్రాజెక్టు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
https://ntvtelugu.com/entrance-tests-dates-confirmed-by-andhra-pradesh-higher-education-department/
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!