Ambati Rambabu: గోదావరికి మళ్లీ వరద వచ్చే పరిస్థితి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
2018 లో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు కాళ్లు, చేతులు పైకి ఎత్తేశాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. లోయర్ కాఫర్ డ్యాంను చంద్రబాబు అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టే ప్రయత్నం చేశారని నిలదీశారు. నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత ఈనాడు రామోజీరావు వియ్యంకుడు అని.. నవయుగను తప్పించి పోలవరం పనులను మేఘా కంపెనీకి ఇచ్చామని కడుపుమంటతో ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో దోచుకుందాం.. దాచుకుందాం అనుకున్నారని.. ట్రాన్స్ట్రాయ్ను తీసేసి చంద్రబాబు నవయుగ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము రివర్స్ టెండర్ ద్వారా మరింత తక్కువకు మేఘాకు ఇచ్చామన్నారు.
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
ఇసుక నుంచి ఏడాదికి 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ వందల కోట్లు దోచుకుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. వనజాక్షి లాంటి అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏం జరిగిందో ప్రజలు అందరూ చూశారని.. ట్రాన్స్ ట్రాయ్ను తప్పించి నామినేషన్ లో నవయుగకు ఇవ్వటం స్కాం కాదా అని ప్రశ్నించారు. పోలవరం విషయంలో టీడీపీ చేసిన పాపాలు సరిచేయలేక తాము నానాపాట్లు పడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. ఓబుళాపురం మైనింగ్పై టీడీపీ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని.. అక్కడ చాలా కాలం నుంచి వివాదం ఉందని.. ఎవరైనా సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.
గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో టీడీపీ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మాధవ్ గురించి, మాధవ్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు అని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. ప్రపంచంలో ఇవే ముఖ్యమైన విషయాలా అని ప్రశ్నించారు. ప్రధాని పలుకరించగానే చంద్రబాబు పులకరించి పోతున్నాడని.. ఎవరైనా పలకరిస్తే తప్పించి సొంతంగా స్థాయి లేదని అర్థం అయినట్లు ఉందని చురకలు అంటించారు. బొకే తోసేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పలకరిస్తాడని చంద్రబాబు తపించిపోతున్నాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!