AP Three Capitals: వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Three Capitals: మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
మరోవైపు.. పవన్ కళ్యాణ్ చాలా పచ్చబొట్లు వేసుకోవాలి.. వారాహి ఏది.. ఎక్కడ..? ఆ సినిమా ఆపారా? అంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలి.. మమ్మల్నే ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్ కే ఉందంటూ వ్యాఖ్యానించారు.. ఇక, లోకేష్, పవన్ లకు నిబద్ధత లేదని మండిపడ్డారు.. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడు.. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అన్నాడు అని సెటైర్లు వేశారు.. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా..? ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని ఎద్దేవా చేశారు.. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా? అని తలలు పట్టుకుంటున్నారన్నారు. ఇక, 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయి.. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో విజయవాడలో ఏర్పాటు చేసిన భూగర్భ జనవనరుల డేటా సెంటర్లోని ల్యాబ్ నిర్ణయిస్తుందన్నారు.. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని.. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖలలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని.. రూ. 16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఉంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!