Ambati Rambabu: చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయంలో ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందన్న ఆయన.. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముణ్ణి దర్శించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్టగా అభివర్ణించారు.. ఇక, చంద్రబాబు, పవన్పై విరుచుకుపడ్డారు అంబటి.. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ .. వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న ఆయన.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడం.. పోలవరాన్ని నాశనం చేసినట్లే చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Bhadrachalam Ramayya Kalyanam Live: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం
Also Read
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదంతూ సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలువచ్చాయి.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాలు.. ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగింది.. 2017-18 నాటి అంచనాలే 50 వేలకు దాటి ఉన్నాయన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు కోసమే పుట్టాడంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు కోసం పుట్టాడు.. పనిచేస్తున్నాడు.. చేస్తాడు.. కానీ, ఆయన్ను దేవుడే రక్షించాలన్నారు.. ఓటు చీలకుండా చేస్తాం అని పవన్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు. రాష్ట్రంలోని మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటు కి ఓటు లాంటిది జరిగింది.. నిరూపించ లేక పోవచ్చు.. కానీ, టీడీపీ ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!