Ambati Rambabu: అందరూ బాగుండాలి.. అందులో కాపులు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: రాజమహేంద్రవరంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో కాపులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని.. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాపు ఎమ్మెల్యేలను ఇటీవల పవన్ కళ్యాణ్ దూషించడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని సూచించారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో కలిసి పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా మరణానికి పవన్ కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అందరూ బాగుండాలని.. అందులో కాపులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం.. త్వరలోనే ప్రారంభం
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అటు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. తమ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎమ్మెల్యే టిక్కెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకు కాపులకు అన్ని విధాలుగా సీఎం జగన్ పెద్దపీట వేశారని బొత్స అన్నారు. గత ప్రభుత్వాలను కాపులను కేవలం ఓటుబ్యాంకుగానే చూశాయని.. కానీ తమ ప్రభుత్వం కాపుల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. కాపులకు ఇంకా సమస్యలు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మరోవైపు పీఆర్పీకి ద్రోహం చేసిన వారికి సమాధానం చెప్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ కించపరుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!