Ambati Rambabu: అందరూ బాగుండాలి.. అందులో కాపులు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: రాజమహేంద్రవరంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో కాపులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని.. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాపు ఎమ్మెల్యేలను ఇటీవల పవన్ కళ్యాణ్ దూషించడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని సూచించారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో కలిసి పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా మరణానికి పవన్ కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అందరూ బాగుండాలని.. అందులో కాపులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం.. త్వరలోనే ప్రారంభం
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అటు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. తమ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎమ్మెల్యే టిక్కెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకు కాపులకు అన్ని విధాలుగా సీఎం జగన్ పెద్దపీట వేశారని బొత్స అన్నారు. గత ప్రభుత్వాలను కాపులను కేవలం ఓటుబ్యాంకుగానే చూశాయని.. కానీ తమ ప్రభుత్వం కాపుల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. కాపులకు ఇంకా సమస్యలు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మరోవైపు పీఆర్పీకి ద్రోహం చేసిన వారికి సమాధానం చెప్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ కించపరుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!