Polavaram Irrigation Project: పోలవరం నిర్మాణంపై మంత్రి అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపాటు పనికిరాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో జాప్యం కొనసాగుతూనే ఉంది.. అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల ఇచ్చిన రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతది కొనసాగించాల అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదికీలక పరిణామం. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందన్నారు. 41.17 కాంటూరు పరిధి వరకు ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయడం జరుగుతుందని.. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందేనన్నారు.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండువేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించడంలేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
నేను మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు పూర్తి చేయాలని తొందరపాటు లేదు.. ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటుతో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు మంత్రి అంబటి. మరోవైపు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.. రాయలసీమ ప్రజలు ఏమాత్రం కంగారుపడాల్సిన అవసంలేదు.. ప్రభుత్వం న్యాయపోరాటం చేయడానికి సిద్దంగా ఉంది. ఉపనధులైన తుంగ, భద్ర నుంచి 42 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణం చేయలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.. దీని వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనేది ప్రభుత్వ భావన.. జలాలు కేటాయింపు విషయంలో కృష్టవాటర్ బోర్డు, బచావత్ కమీషన్ చెప్పిందో అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఈ మధ్యే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!